ప్రజాశక్తి-చల్లపల్లి: చల్లపల్లి బస్టాండ్ సెంటరులో అంగన్వాడీల దీక్షకు మద్దతుగా శుక్రవారం అఖిలపక్షాలఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. అర గంటకు పైగా ట్రాఫిక్ నిలిచిపోవటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఈసందర్భంగా పలువురు మాట్లాడుతూ అంగనవాడి కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అంగనవాడి కార్యకర్తలు పట్ల పభుత్వ మారాలని పలువురు నాయకులు హెచ్చరించారు.సంఘటన విషయం తెలుసుకొన్న ఎస్ఐ చినబాబు హుటాహుటిన సంఘటన ప్రాంతానికి చేరుకొని ఆందోళనకారులను పక్కకు తొలగించి ట్రాఫిక్ క్రమబద్ధీకరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి యాద్దనపూడి మధు, సీఐటీయూ జిల్లాఉపాధ్యక్షులు మర్రాపు పోలీనాయుడు, సీఐటీయూ మండల కార్యదర్శి మహమ్మద్ కరీముల్లా, కోడూరు, మోపిదేవి సిపిఎం మండల కార్యదర్సులు పి. మోహనరావు, బి. అదిశేషు, వ్యవసాయకార్మిక సంఘం మండల కార్యదర్శి బి. కోటేశ్వరావు, టీడీపీ మండల కార్యదర్శి మోర్ల రాంబాబు, టీడీపీ మహిళా జిల్లా నాయకురాలు పి. కృష్ణ కుమారి సిపిఐం(ఎంఎల్ )నాయకులు పి.జనార్దన్, చాట్రగడ్డ సుధీర్, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు మలుపెద్ది రత్న కుమారి, ఆటో యూనియన్ నాయకులు పాల్గొన్నారు.