ట్యాబ్ ల పంపిణీ

Dec 30,2023 13:21 #Krishna district
tabs supply

ప్రజాశక్తి-రెడ్డిగూడెం : శాసన సభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ ఆదేశాల మేరకు రెడ్డిగూడెం మండలం కూనపరాజు పర్వ గ్రామంలో జిల్లా పరిషత్ హైస్కూల్ నందు ట్యాబ్ ల పంపిణీ కార్యక్రమంలో వైస్సార్సీపీ సీనియర్ నాయకులు రెడ్డిగూడెం మండల జడ్పీటీసీ సభ్యులు పాలంకి విజయభాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో విద్యా విప్లవం మొదలైంది. చదువులు అంటే ప్రభుత్వానికి ఖర్చు కాదు.. అదో గురుతర బాధ్యత అని, పిల్లలను చదువే గొప్ప ఆస్తిగా భావించి.. నాణ్యమైన చదువులు అందించే పాఠశాలలను సరికొత్తగా రూపుదిద్దుతోంది. ఇది బావితరాల ఉజ్వల భవితకు బాటలుగా భావిస్తోంది. నాడు నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలల రూపురేఖలు మారుస్తూ, షూ దగ్గర నుంచి యూనిఫామ్ వరకు ఉచితంగా అందిస్తున్నారు. ఈ సందర్బంగా 8వ తరగతి విద్యార్థి, విద్యార్థునులకు ట్యాబులు అందచేసి శుభాకాంక్షలు తెలిపినారు. అనంతరం జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పాల హారిక రాము చొరవతో స్ఫూర్తి 10తరగతి స్టడీ మెటీరియల్స్ విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో తోటకూర రవిబాబు, సర్పంచ్ మాతంగి వెంకటేశ్వరరావు , పాకాలపాటి ప్రసాద్, చుండ్రు శ్రీను, గుత్తి ప్రసాద్, స్కూల్ కమిటీ చైర్మన్ గుత్తి నారాయణ, స్కూల్ ప్రిన్సిపాల్ G.ప్రసాద్  పాల్గొన్నారు.

➡️