మచిలీపట్నంలో టిడిపి ప్రచారం

Apr 12,2024 12:50 #Krishna district

మాజీ మంత్రి కొల్లు రవీంద్ర
ప్రజాశక్తి-మచిలీపట్నం రూరల్ : మచిలీపట్నం మండలం తాళ్లపాలెం పంచాయతీ జొన్నలవాడి మోడిలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ పార్లమెంట్ సభ్యుడు కొనకల్ల నారాయణరావు, బాలసౌరి తనయుడు అనుదీప్ లు ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు మంచినీటి సమస్యను, వంతెన సమస్యను రవీంద్ర దృష్టికి తీసుకువచ్చారు. ఉమ్మడి ప్రభుత్వము అధికారంలోకి రాగానే తాళ్లపాలెం పంచాయతీలో ఇంటింటికి కుళాయి, వంతెనను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. రాబోయే కాలంలో బందరును అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకునేందుకు అందరమూ కృషి చేద్దామని పిలుపునిచ్చారు. జగన్ మాయమాటలకు ఒకసారి అవకాశం ఇచ్చినందుకే రాష్ట్రం సర్వనాశనమైంది బందరు పూర్తిగా అభివృద్ధి నిరోధకంగా తయారయింది కాబట్టి మరోసారి ఏదైనా చిన్న తప్పు చేస్తే పిల్లల భవిష్యత్తు బందరు భవిష్యత్తు నాశనమవుతుందని స్పష్టం చేశారు. అభివృద్ధి చేస్తామని మాయమాటలు చెప్పే అధికారంలోకి వచ్చిన పేర్ని నాని ఆస్తులు పెంచుకున్నాడు, అమాయక ప్రజలను వేధిస్తున్నాడు, ఇప్పుడు బందరును గంజాయికి కేంద్రంగా మార్చేశాదన్నారు.ప్రశ్నించిన వారిపై గంజాయి బ్యాచ్తో దాడులు చేయిస్తూ పబ్బం గడుపుకుంటున్నాడు, పోలీసులు చర్యలు తీసుకుంటే చివరికి పోలీస్ స్టేషన్ల మీద కూడా దాడి చేస్తూ పోలీసుల్ని కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నాడన్నారు. ప్రజలు ఈ విషయాలన్నీ గమనిస్తూ రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి అండగా నిలవాలని ఈ రాక్షస ప్రభుత్వాన్ని ఈ గంజాయి ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాలని కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో గొపు సత్యనారాయణ,లంకే నారాయణ ప్రసాద్ తదితర నాయకులు కార్యర్తలులు పాల్గొన్నారు.

➡️