ప్రజాశక్తి-చల్లపల్లి (కృష్ణా) : తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు వల్లభనేని బాలసౌరి, మండలి బుద్ధప్రసాద్ ల విజయం కోరుతూ బావ బావమరుదులు కనపర్తి అవనీంద్ర, మండలి వెంకట్రామ్ లు చల్లపల్లి మండలం మేకావారిపాలెంలో మంగళవారం ఉదయం ప్రచారం చేపట్టారు. అవనిగడ్డ నియోజకవర్గ కూటామి అభ్యర్థి డా.మండలి బుద్ధప్రసాద్ అల్లుడు, ఎన్నారై అవనీంద్ర, కుమారుడు వెంకట్రామ్ లు మేకావారిపాలెంలో ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్ధించారు. రెండు ఓట్లు గాజు గ్లాసు గుర్తుపైనే వేయాలనీ, బ్యాలెట్ బాక్సులో ఆరవ నెంబరుపై రెండు ఓట్లు వేసి బాలసౌరి, బుద్ధప్రసాద్ లకు అఖండ విజయం అదించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామంలో ప్రచారం చేపట్టిన అవనీంద్ర, వెంకట్రామ్ లకు గ్రామస్థులు, టీడీపీ..జనసేన నేతలు ఘన స్వాగతం పలికారు. హారతులిచ్చి ఆహ్వానించారు. ప్రచారానికి ప్రజల నుంచీ విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు మోర్ల రాంబాబు, మచిలీపట్నం పార్లమెంట్ తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి పైడి పాముల కృష్ణకుమారి. సీనియర్ నాయకులు యార్లగడ్డ శ్రీనివాసరావు స్థానిక నేతలు పాల్గొన్నారు.