ప్రజాశక్తి-అనంతపురం : సిఎం జగన్మోహన్రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘ఆడుదాం ఆంధ్ర’ కార్యక్రమం సందర్భంగా శనివారం రాయదుర్గం పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుండి ‘ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం’ పై ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపాల్ చైర్ పర్సన్ పోరాళ్ళు శిల్ప ముఖ్యఅతిథిగా పాల్గొని పచ్చ జెండా ఊపి ర్యాలీని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ర్యాలీలో మున్సిపల్ కమిషనర్ వి.దివాకర్ రెడ్డి, వార్డ్ సభ్యులు లావణ్య, ప్రతాప్, శ్రీలక్ష్మీ, మమత, షాబిరా భి, శారద, నసీమా, లుభ్నా గజాల, గోవిందరాజులు, ఉషా, దేవరాజు, వైసిని పట్టణ కన్వీనర్ శివప్ప, వార్డు ఇన్ఛార్జులు శివ, ఇస్మైల్, శ్రీరామ్ రెడ్డి, బషీర్, రామాంజనేయులు, మున్సిపల్ సిబ్బంది పాఠశాల పీడీలు, విద్యార్థులు పాల్గొన్నారు.