ప్రజాశక్తి-సీతమ్మధార : ఉత్తర నియోజకవర్గాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తానని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి లక్కరాజు రామారావు అన్నారు. జివిఎంసి 43వ వార్డు పరిధి మురళీనగర్ ప్రాంతంలో ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గం, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలన్నారు. ఉత్తర నియోజకవర్గం ప్రజలు మంచి నీటి సమస్యను ఎదుర్కొంటున్నారని, వర్షాలు పడితే కొండ చరియలు విరిగిపడుతున్నాయని తెలిపారు. తాను ఎమ్మెల్యేగా గెలిస్తే ఈ సమస్యలు పరిష్కారానికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం, కాంగ్రెస్ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.
ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి రామారావు తదితరులు