ప్రజాశక్తి-సీతమ్మధార : ఉత్తర నియోజకవర్గం వైసిపి ఎమ్మెల్యేగా పోటీచేస్తున్న కెకె.రాజుకు పలు సంఘాలు మద్దతు తెలిపాయి. విశాఖ మారుతి, నాయీ బ్రాహ్మణ, నాదస్వర, డోలు కళాకారుల సంఘం సభ్యులు, విశాఖ జిల్లా సీరత్ కమిటీ సభ్యులు కెకె.రాజును కలిసి మద్దతు తెలిపారు. జివిఎంసి 26వ వార్డు సీనియర్ నాయకులు పాండవ శ్రీనివాసరావు, పాండవ ఈశ్వరరావు ఆధ్వర్యాన జనసేన యూత్ వైసిపిలో చేరారు. వీరికి కెకె రాజు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. జివిఎంసి 51వ వార్డు పరిధి మాధవధార లాన్సమ్ గ్రీన్ అపార్ట్మెంట్లో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కెకె.రాజు హాజరై మాట్లాడుతూ, ప్రతి ఒక్కరు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో 51 వార్డు కార్పొరేటర్ రేయ్యి వెంకట రమణ, అమర్ రెడ్డి, ప్రభాకర్, అనిల్కుమార్, ఎవిఎన్.రాజు తదితరులు పాల్గొన్నారు. రైల్వే న్యూ కాలనీ మసీదు వద్ద ముస్లిం పెద్దలను కెకె.రాజు కలిశారు. వైసిపి గెలుపునకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సనపల చంద్రమౌళి, బాణాల శ్రీనివాస్, ఆళ్ల లీలావతి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.