వైసిపిలో చేరిన కోవెలకుంట్ల మేజర్ పంచాయతీ మాజీ సర్పంచ్
సిఎం సమక్షంలో వైసిపిలోకి టిడిపి నేతలు
ప్రజాశక్తి – ఆళ్లగడ్డ
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పలువురు టిడిపి నేతలు వైసిపిలో చేరారు. ఆళ్లగడ్డలో ముఖ్యమంత్రి బస చేసిన శిల్పా నేచర్ హౌమ్ వద్ద వైఎస్సార్ జిల్లా కమలాపురం నియోజకవర్గానికి చెందిన టిడిపి రాష్ట్ర మాజీ కార్యదర్శి, అఖిలభారత బ్రాహ్మణ సంఘం మాజీ అధ్యక్షుడు కాశీభట్ల సాయినాథ్ శర్మ, ఆర్టిసి మాజీ చైర్మన్ రెడ్డ్యం వెంకటసుబ్బారెడ్డి, బనగానపల్లె నియోజకవర్గం కోయిలకుంట్ల మేజర్ పంచాయతీ మాజీ సర్పంచి విఎస్ కృష్ణమూర్తి(లాయర్ బాబు)లు సిఎం జగన్ సమక్షంలో వైసిపి తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో కడప జిల్లా కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, బనగానపల్లె, శ్రీశైలం ఎమ్మెల్యేలు కాటసాని రామిరెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి, సీనియర్ నాయకులు కర్ర హర్షవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.