రూ.4వేల పింఛన్లు అందజేత

Jul 1,2024 11:56 #ntr district

ప్రజాశక్తి-గంపలగూడెం: గడిచిన ప్రభుత్వం కంటే నూతనంగా ఏర్పడ్డ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మూడు వేలకు మరో వెయ్యి రూపాయలు పెంచి 4000 రూపాయలు పెన్షన్ ప్రతి ఒక్కరికి అందజేయడం జరుగుతుందని గంపలగూడెం మండల టిడిపి అధ్యక్షులు రేఖలు వీరారెడ్డి తెలిపారు. జూలై 1వ తేదీ సోమవారం ఉదయాన్నే టౌన్ పరిధిలో పలుచోట్ల పర్యటించి, పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా, ఎన్నికల వాగ్దానంలో భాగంగా ఏప్రిల్, మే, జూన్ నెలకి సంబంధించి, పెంచిన వెయ్యి రూపాయల తో కలిపి ఒక్కొక్కరికి ₹7,000 అందజేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోట పుల్లమ్మ, నా టౌన్ అధ్యక్షులు కాజా రవికుమార్, పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అధికారి జి. శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️