ప్రజాశక్తి – వన్టౌన్ : శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి దుర్గమ్మను విజయవాడ నగర నూతన పోలీస్ కమిషనర్ పి హెచ్ డి రామకృష్ణ దంపతులు గురువారం శ్రీ అమ్మవారి దర్శనార్థం ఆలయానికి విచ్చేశారు. ఆలయ ఇఒ కె.ఎస్.రామరావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి శ్రీ అమ్మవారి దర్శనం కల్పించారు. అమ్మవారి దర్శనానంతరం వీరికి ఆలయ వేదపండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ ఇఒ అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం, చిత్రపటం అందజేశారు. అనంతరం వీరు శ్రీ మల్లేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.