ప్రజాశక్తి – విజయవాడ అర్బన్ : నగరంలోని టిక్కిల్రోడ్డులోని టెంప్టేషన్స్ రెస్టారెంట్ నందు రోబోటిక్స్ వడ్డింపు పేరుతో రోబోటిక్ సేవలను ప్రారంభించినట్లు రెస్టారెంట్ మేనేజర్ రాము తెలిపారు. శనివారం సాయంత్రం రెస్టారెంట్ నందు రోబోట్ ద్వారా హౌటల్కు వచ్చిన వారికి వారికి కావాల్సిన పసందైన వంట కాలను అందిం చారు. ఈసంద ర్భంగా మేనేజర్ మాట్లాడుతూ నగరంలో మొట్ట మొదటి సారిగా వినూ త్నంగా టెంప్టేషన్స్ నందు రోబోటిక్ సేవలను ప్రారంభిం చినట్లు తెలిపారు. భోజన ప్రియులకు వారికి కావాల్సిన వంటకాలు ఆర్డర్ ఇవ్వగానే కొద్ది నిముషాల్లోనే రోబోట్ వారి డైనింగ్ వద్దకు రుచికరమైన వంటకాలను అందిస్తుందని తెలిపారు. తమ రెస్టారెంట్ నందు రోబోట్తో ఫుడ్ సర్వీస్తో పాటుగా క్లీనింగ్, ఫీడ్ బ్యాక్ను తీసుకుంటుందని తెలిపారు. తమ ఈకొత్త రోబోటిక్స్ సేవలను పరిశీలనలో భాగంగా తొలుత ప్రారంభించామని త్వరలో మరిన్ని సేవలను వినియోగదారులకు అందించనున్నట్లు తెలిపారు.