ఘనంగా మట్టలాదివారపు ఊరేగింపు 

Mar 24,2024 12:52 #ntr district

ప్రజాశక్తి-రెడ్డిగూడెం(ఎన్టీఆర్ జిల్లా):  మండలంలో మట్టలాదివారపు ఊరేగింపు, ఆరాధనలు ఘనంగా నిర్వహించారు. ఏసుక్రీస్తు యెరూషలేము ప్రవేశం ను గుర్తు చేసుకుంటూ క్రైస్తవులు జరుపుకునే ఈ వేడుకల ఊరేగింపు ప్రతి గ్రామంలో క్రైస్తవ భక్తులు పూలతో అలంకరించిన ఈతమట్ట లను చేతపట్టుకొని హోసన్న జయం, ప్రభువు పేరట వచ్చు వాడు స్తుతింపబడును గాక అంటు పాటలు పాడుతూ ఉత్సాహంగా ఊరేగింపు నిర్వహించారు. మండల కేంద్రంలో సిఎస్ఐ క్రైస్ట్ చర్చి ఆధ్వర్యంలో మట్టలాదివారపు ఊరేగింపు ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా రెవ జి విశ్వనాథ్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

➡️