విజయవాడ, కంచికచర్ల : బందరు రోడ్డులోని రాఘవయ్య పార్కు వద్ద గల ఠాగూర్ స్మారక గ్రంథాలయంలో ఈనెల 29 నుండి జూన్ 7వ తేదీ వరకు వేసవి విజ్ఞాన శిబిరం నిర్వహించనున్నట్లు గ్రంథాలయాధికారి కె.రమాదేవి తెలిపారు. కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో కంచికచర్ల శాఖా గ్రంథాలయంలో ఈ నెల 29వ తేదీ నుండి జూన్ 6వ తేదీ వరకు వేసవి విజ్ఞాన శిబిరం నిర్వహిస్తున్నట్లు గ్రంథాలయాధికారి అల్లూరి రామచంద్రుడు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిబిరాలు ప్రతి రోజు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ శిబిరంలో పుస్తక పఠనం, కథ చెప్పించడం, చదివించడం, పుస్తక సమీక్ష, చిత్రలేఖనం, పేపర్ ఆర్ట్ (క్రాఫ్ట్), డ్రామా, స్పోకెన్ ఇంగ్లీష్, కవితలు, సులువుగా గణితం నేర్పిండం, సంగీతం, డాన్స్, భగవద్గీత శో ్లకాలు, చదరంగం, క్యారమ్స్, యోగా మొదలైనన వాటిలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. విద్యార్థులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.