ప్రజాశక్తి-పొదలకూరు (నెల్లూరు) : నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపింది. హై స్కూల్ సమీపంలో పొలాలకు వెళ్లే దారిలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేసినట్లు కనిపించడంతో ఆ గ్రామ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. గ్రామస్తులంతా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/03/nellore-tatipatri.jpg)