పార్వతీపురం (మన్యం) : పార్వతీపురం మన్యం జిల్లాలో శనివారం రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ పర్యటిస్తున్నారు. గుమ్మలక్ష్మీపురం జ.డ్పి.హెచ్.ఎస్ పాఠశాలలో డిజిటల్ క్లాస్ రూంను పరిశీలించారు. ప్రధాన ఉపాధ్యాయుని పిలిచి జిల్లా అధికారులకు డిజిటల్ క్లాస్ చెప్పాలని ప్రవీణ్ ప్రకాష్ అడిగారు. అయితే ఆ ఉపాధ్యాయుడికి బైజుస్, డిజిటల్ క్లాస్ రూమ్ నిర్వహణపై అవగాహన లేకపోవడంతో జిల్లా డీ.ఈ.ఓ, డిప్యూటీ డీఈఓ, జిల్లా నోడల్ ఆఫీసర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.