బెస్ట్ డైరీ ఫార్మర్ అవార్డులు అందుకున్న పాపారావు

Apr 27,2024 15:48 #Awards, #Konaseema

ప్రజాశక్తి – ఆలమూరు : ప్రపంచ పశు వైద్య దినోత్సవాన్ని శనివారం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వి.వి.గార్డెన్స్ లో ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, శ్రీమురళీకృష్ణ సంస్థల అధినేత వంటిపల్లి పాపారావుకు బెస్ట్ ఎంటర్ పర్నియర్, బెస్ట్ డైరీ ఫార్మర్ అవార్డులను రాష్ట్ర పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ అమరేంద్ర కుమార్ చేతుల మీదుగా అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా పాపారావు స్థానిక మీడియాతో మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో భాగమైన పశుసంపద వృద్ధికి పశువైద్య అధికారులు అందిస్తున్న సేవలను ప్రశంసించారు. పాడి రైతులతో మంచి సత్సంబంధాలు ఏర్పాటు చేసుకొని మరిన్ని ఉత్తమ సేవలు అందించాలన్నారు. వైద్య వృత్తిలో బాధ్యతగా వ్యవహరిస్తూ మంచిపేరు పొందాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలమూరు, రామచంద్రపురం వెటర్నరీ ఏడీలు అనిత, రామకృష్ణలతో పాటుగా పలువురు పశు వైద్యులు పాల్గొన్నారు.

➡️