ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : పెన్షన్దార్లు పెన్షన్ డబ్బులు కోసం పడుతున్న కష్టాలు వారి చావుకు వచ్చినట్లు ఉంది. మండుటెండలో పెన్షన్ కోసం పడరాని పాట్లు పడుతున్నారు. శుక్రవారం కూడా పెన్షన్ డబ్బులు కోసం బ్యాంక్ లు వద్ద పడిగాపులు కాస్తున్నారు. గంటలు కొద్ది బ్యాంకు లు వద్ద ఉంటే తప్ప పెన్షన్ డబ్బులు ఇవ్వడం లేదు. శుక్రవారం నగరంలో అన్ని బ్యాంక్ లు దగ్గర ఇదే పరిస్తితి నెలకొంది. పెన్షన్ తీసుకోవడం కోసం పెన్షన్ తీసుకొనే వ్యక్తితో పాటు మరొకరు పని మానుకొని రావాల్సిన పరిస్తితి. ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో బ్యాంక్ లు వద్ద ఉన్న చెట్లు కింద గంటలు కొద్ది ఉండాల్సిన పరిస్తితి.ఎండ తీవ్రంగా ఉండటంతో వచ్చే ఆటోలకు వందలు రూపాయిల చెల్లించాల్సి వస్తుందనీ పెన్షన్ దార్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి బ్యాంక్ వద్దకు చేరుకున్న పెన్షన్ దార్లు మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉండాల్సి వస్తుంది.పెన్షన్ దార్లు కోసం బ్యాంక్ ద్వారా ఇస్తున్న డబ్బులు ఉదయం ఇచ్చే ఏర్పాటు చేస్తే బాగుంటుందని పెన్షన్దారుడు భీమారావు ప్రజాశక్తితో అన్నారు. ‘పెన్షన్ డబ్బులు మా ప్రాణం మీదకు వచ్చినట్లు ఉంది’ అని ఆవేదన వ్యక్తం చేశారు.