ప్రజాశక్తి-పల్నాడు : పల్నాడు జిల్లాలో సార్వత్రిక ఎన్నికల సరళని ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు కలెక్టర్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు ఎన్నికల అధికారి శివ శంకర్ లోతేటి తెలిపారు. అందులో వెబ్ కాస్టింగ్ మానిటరింగ్, డిస్టిక్ కమాండ్ కంట్రోల్ రూము కమ్యూనికేషన్ అండ్ మానిటరింగ్, కంట్రోల్ రూమ్ మీడియా మానిటరింగ్ రూములు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.