బాలకృష్ణ యాత్ర విజయవంతం చేయాలి : టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య

Apr 28,2024 01:25 ##tdp #Balakrishna #Kondepi

ప్రజాశక్తి – మర్రిపూడి
ఈ నెల 30న సినీ నటులు, హిందూపురం ఎంఎల్‌ఎ నందమూరి బాలకృష్ణ శంఖారావ యాత్ర విజయవంతం చేయాలని టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య కోరారు. సభా ప్రాంగణాన్ని దామచర్ల సత్యతోపాటు స్థానిక నాయకులు కలిసి శనివారం పరిశీలించారు. మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ఎన్నికల ప్రచారంలో భాగంగా నందమూరి బాలకృష్ణ స్వర్ణాంధ్ర సాధికార యాత్ర పేరుతో నియోజకవర్గానికి వస్తున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామం నుండి పెద్దఎత్తున టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల నాయకులు తరలివచ్చి విజయవంతం చేయాలని అన్నారు. కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు చెరెడ్డి నర్సారెడ్డి, తుళ్లూరి వెంకట నరసింహారావు, రేగుల వీరనారాయణ, యర్రమోతు శ్రీనివాసులు, గొంటు హనుమారెడ్డి పాల్గొన్నారు.

➡️