ప్రజాశక్తి-మార్కాపురం : తొలి పాత్రికేయుడు, స్వాతంత్ర సమరయోధులు, పశ్చిమ ప్రాంతంలో తొలి పాత్రికేయులు ఓరుగంటి వేంకట రమణయ్య వర్ధంతి సందర్భంగా మార్కాపురం ప్రెస్ క్లబ్ ఆవరణలో ఉన్న ఆయన్న విగ్రహానికి ఏపిఐఐసి చైర్మన్ జంకె వెంకటరెడ్డి, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మోహన్ రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు.