జగ్గయ్యపేట (ఎన్టీఆర్ జిల్లా) : బైక్ను స్కూల్ బస్సు ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా, ముగ్గురికి తీవ్రగాయాలైన ఘటన సోమవారం పెనుగంచిప్రోలు మండలంలోని నవాబుపేట వద్ద జరిగింది. చందలపాడు మండలం కోనాయపాలెం నుండి మంగోలుకు బైక్ పై వెళుతుండగా, స్కూల్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తల్లి ఆదిలక్ష్మి మృతి చెందారు. కుమారుడు సురేష్, కోడలు అంజమ్మ , మనవరాలు రిషిత (2) లకు తీవ్రగాయాలయ్యాయి. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. గాయపడినవారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.