ప్రజాశక్తి – మంగళగిరి (గుంటూరు) : పేద ప్రజల ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కావాలంటే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీల అభ్యర్థులను గెలిపించాలని సిపిఎం సీనియర్ నాయకులు పి.బాలకృష్ణ పిలుపునిచ్చారు. శుక్రవారం మంగళగిరి పట్టణంలోని సూర్యనారాయణ నగర్ లో ఇండియా బ్లాక్ వేదిక తరపున సిపిఎం అభ్యర్థిగా మంగళగిరి నియోజవర్గం నుంచి జొన్న శివశంకరరావు, గుంటూరు పార్లమెంటు పోటీ చేస్తున్న సిపిఐ అభ్యర్థి జంగాల అజరు కుమార్ విజయాలను కాంక్షిస్తూ విస్తఅత ప్రచారం జరిగింది. ఇంటింటికి తిరిగి ఓట్లను సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటేసి జొన్న శివశంకరరావును గెలిపించాలని కోరారు. పార్లమెంటు సిపిఐ అభ్యర్థి గుర్తు కంకి కొడవలి ఓటేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మంగళగిరి పట్టణ కార్యదర్శి వై కమలాకర్, సిపిఎం నాయకులు ఏ నికల్, కాసిం, కే సహిబ్, నవిత, పవన్, యశ్వంత్, తదితరులు పాల్గొన్నారు.