ప్రజాశక్తి-ఒంగోలు సబర్బన్: ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో వైసిపికి ఓటేసి గెలిపించాలని ఆ పార్టీ ఒంగోలు నియోజకవర్గ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి బాలినేని శచీదేవి కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆమె 35వ డివిజన్ సుందర్నగర్, గుప్తాస్ గార్డెన్ టవర్స్ ప్రాంతంలో పర్యటించారు. ఇంటింటికీ తిరిగి ఓట్లు అభ్యర్థించారు. ఒంగోలు నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరం తరం పాటుపడుతున్న బాలినేని శ్రీనివాసరెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు ఏ అవసరం వచ్చినా బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించి పనిచేసే వ్యక్తి అని గుర్తు చేశారు. ఆమె వెంట కార్పొరేటర్ ఆదిపూడి గిరిజా శంకర్ శాండిల్యా, పలువురు వైసిపి నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.