ప్రజాశక్తి-శృంగవరపుకోట : జులై ఒకటో తేదీన పంపిణీ చేయబోయే పింఛన్ల పంపిణీ కార్యక్రమం సజావుగా జరిగేలా చూడాలని 5 మండలాల ఎంపిడిఒలను ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఆదేశించారు. శనివారం లక్కవరపుకోట మండల కేంద్రంలో ఐదు మండలాల ఎంపిడిఒలతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. చంద్రబాబు నాయుడు అత్యంత ప్రతిష్టాత్మంగా తీసుకున్న పెంచిన పింఛన్లను జులై 1 పంపిణీ చేస్తున్నందున సచివాలయ సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు టిడిపి నాయకులను భాగస్వామ్యం చేసుకొని పింఛన్ల కార్యక్రమం సజావుగా జరిగేలా చూడాలని ఆదేశించారు. మొదటి రోజే 90 శాతం పంపిణీ పూర్తి కావాలలన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు చొక్కాకుల మల్లునాయుడు, మాజీ ఎంపిపి కొల్లి రమణమూర్తి, మాజీ జెడ్పిటిసి కరెడ్ల ఈశ్వరరావు, ఖాసాపేట సర్పంచ్ కోళ్ల భూపాల్ నాయుడు, ఎంపిడిఒలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/06/skt-mla-2.jpg)