తండ్రి గెలుపుకోసం తనయుడి ప్రచారం

ప్రజాశక్తి-కొమరోలు: మండలంలోని తాటిచర్ల గ్రామంలో గిద్దలూరు టిడిపి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుముల అశోక్‌రెడ్డి తనయుడు ముత్తుముల దివ్యేష్‌రెడ్డి, కొమరోలు మండల అధ్యక్షులు బొనేని వెంకటేశ్వర్లు యాదవ్‌ బుధవారం ఉదయం తాటిచర్ల గ్రామంలో ఇంటింటికీ తిరిగి టీడీపీ, జనసేన, బీజేపీ మ్యానిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు. మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో గిద్దలూరు అభ్యర్థిగా పోటీ చేస్తున్న ముత్తుముల అశోక్‌రెడ్డికి, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాగుంట శ్రీనివాసులురెడ్డికి సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️