సమస్యాత్మక గ్రామాల్లో ఎస్‌పి పర్యటన

May 8,2024 21:36

 ప్రజాశక్తి – కురుపాం : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మండలంలో గల సమస్యాత్మక గ్రామాలైన కురుపాం, కిచ్చాడ పోలింగ్‌ కేంద్రాలను బుధవారం సాయంత్రం ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ సందర్శించారు. ఈ సందర్భంగా పోలింగ్‌ కేంద్రాల స్థితి గతులు, మౌలిక వసతులు, విద్యుత్‌, రవాణా, భద్రతాపరమైన ఏర్పాట్లు గురించి అడిగి తెలుసుకొని సిబ్బందికి తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఎస్‌పి వెంట పాలకొండ డిఎస్పీ జివి కృష్ణారావు, ఎల్విన్‌పేట సిఐ పి.సత్యనారాయణ పాల్గొన్నారు.

➡️