‘వై ఎపి నీడ్స్‌ జగన్‌’లో చేదు అనుభవం

'వై ఎపి నీడ్స్‌ జగన్‌'లో చేదు అనుభవం

‘వై ఎపి నీడ్స్‌ జగన్‌’ కార్యక్రమంలో నాయకులను నిలదీస్తున్న కుర్లపల్లితండా గ్రామస్తులు

         కనగానపల్లి : మండల పరిధిలోని కుర్లపల్లితండాలో ‘వై ఎపి నీడ్స్‌ జగన్‌’ కార్యక్రమంలో పాల్గొన్న వైసిపి నాయకులకు చేదు అనుభవం ఎదురైంది. వైసిపి మండల కన్వీనర్‌ అమర్‌నాథ్‌రెడ్డి, ఎంపిపి కుంపటి భాగ్యమ్మ ఆధ్వర్యంలో గ్రామంలో ‘వై ఎపి నీడ్స్‌ జగన్‌’ కార్యక్రమం నిర్మహించగా గ్రామస్తుల నుంచి నిరసనలు, నిలదీతలు ఎదురయ్యాయి. ఈ నాలుగన్నరేళ్లలో మా గ్రామానికి ఏమి చేశారని వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసిపి పాలనలో గ్రామంలో జరిగిన అభివృద్ధి శూన్యమని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి ఇచ్చిన వాగ్ధానాలు ఏమయ్యాయని ప్రశ్నించగా వారు సమాధానం ఇవ్వకుండా దాటవేశారు. శ్మశానవాటికకు స్థలం కొని ఇస్తానని మాట ఇచ్చిన తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఇంతవరకూ సెంటు భూమి కొనివ్వలేదని ధ్వజమెత్తారు. ఇంటి స్థలాలు ఇచ్చి 45 గృహాలు నేనే కట్టిచ్చి ఇస్తానన్నా ఎమ్మెల్యే ఒక్క ఇళ్లయినా కట్టిచ్చి ఇచ్చాడా అని నిలదీశారు. వైసిపి ప్రభుత్వంలో రెడ్లదే పెత్తనం అంటూ గిరిజనులు అసహనం వ్యక్తం చేశారు.

➡️