ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే అభ్యర్థి వై. విశ్వేశ్వరరెడ్డి
వజ్రకరూరు : సిఎం జగన్ వినాశనాన్ని కోరుతూ టిడిపి అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆయన సంకుచిత బుద్ధికి నిదర్శనమని వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి వై.విశ్వేశ్వరరెడ్డి అన్నారు. సోమవారం ఉరవకొండలోని 5, 6వ వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా మల్లేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్థానిక నేతలతో కలిసి ఇంటింటికీ ప్రచారం చేపట్టారు. ఫ్యాను గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తర్వాత ప్రచార రథంపై రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో జరిగిన సభలో ‘జగన్మోహన్రెడ్డి.. రేపు నిన్ను చంపితే ఏమవుతుంది’ అంటూ చంద్రబాబు బరితెగించి చేసిన వ్యాఖ్యలపై వై.విశ్వేశ్వరరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. జగన్ను రాజకీయంగా ఎదుర్కోలేకే ఆయన్ను భౌతికంగా నిర్మూలించేందుకు చంద్రబాబు కుతంత్రం పన్నుతున్నారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. జగన్ మరోసారి సిఎం అయితేనే రాష్ట్రంలో పేదరికం లేకుండా పోతుందన్నారు. ఆయన తెచ్చిన సంస్కరణలు దేశానికే ఆదర్శమన్నారు. ఐదేళ్ల పాలనలో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయన్నారు. మీకు మంచి జరిగి ఉంటేనే ఓటు వేయాలని జగన్ ప్రజలను అడుగుతుంటే.. ప్రతిపక్షాలకు దిక్కు తోచక నిరాశ, నిస్పృహలతో ఇష్టమొచ్చినట్లు నోరు పారేసుకుంటున్నారని విమర్శించారు. వీరు చేసే విమర్శలతో జగన్పై రోజురోజుకూ ఆదరణ పెరుగుతుందే తప్ప తగ్గదన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా జగన్కే ఓటు వేయాలని ప్రజలు నిర్ణయించారని వెల్లడించారు. ‘కూటమి’ బూటకపు హామీలు నమ్మొద్దుటిడిపి, జనసేన, బిజెపి కూటమి బూటకపు హామీలు, మాయమాటలను ప్రజలు నమ్మి మోసపోవద్దని యువజన విభాగం రాయలసీమ జిల్లాల జోనల్ ఇన్ఛార్జి ప్రణరురెడ్డి సూచించారు. సోమవారం విడపనకల్లు మండలం పాల్తూరు గ్రామంలో విజయ సంకల్పయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా వైసిపి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు పుష్పావతి భీమిరెడ్డి, హనుమంతు, భరత్రెడ్డి, శ్రీరాములు, కరణం భీమిరెడ్డి, ఓబులేష్, దాసరి లక్ష్మి, షణ్ముఖగౌడ్, శివ, రాజశేఖర్, డిష్ వెంకటేష్, వెంకటేష్, నాగరాజ్, తదితరులు పాల్గొన్నారు.బెలుగుప్ప : మండల పరిధిలోని బూదవర్తి, శ్రీరంగపురం, నక్కలపల్లి గ్రామాల్లో వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం అధికారం కోసం కూటమి ప్రజల్లోకి వస్తోంది తప్ప ప్రజల సంక్షేమం కోసం కాదన్నారు. కావున ఎన్నికల్లో ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు పెద్దన్న, రామాంజనేయులు, త్రిలోకనాథ్రెడ్డి, చిన్న మచ్చన్న, పి.శ్రీనివాసులు, బి.శివలింగప్ప, జి.శ్రీనివాసులు, వరలక్ష్మి, సాహితరెడ్డి, రామిరెడ్డి, మారుతీరెడ్డి, రేఖమ్మ, వెంకట్రెడ్డి, రవినేపల్లి, రమేష్, అనిల్, నక్కలపల్లి భాస్కర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.