బత్తలపల్లి రోడ్షోలో కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, తదితరులు
బత్తలపల్లి : టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అపద్దాలకోరు అని ధర్మవరం వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి విమ ర్శించారు. మండల కేంద్రమైన బత్తలపల్లిలో వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కమతం ఈశ్వరయ్య, ఎంపీపీ బగ్గిరి త్రివేణి, మాజీ కన్వీనర్ బగ్గిరి బయపిరెడ్డి, ఉపాధ్యక్షులు కోటి సురేష్, ఎంపీటీసీ సభ్యులు కోటి నరేష్ కుమార్, సర్పంచులు అక్కిం కాకమ్మ, జయచంద్రారెడ్డి, బండి వీరనారప్ప, చల్లా క్రిష్ణాతోపాటు మండల నాయకులతో కలిసి కేతిరెడ్డి ఎన్నికల ప్రచారం, రోడ్షో నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇచ్చిన మాటకు కట్టుబడే జగనన్నకు.. మాయమాటలతో మభ్యపెట్టే బాబుకు చాలా వ్యత్యాసం ఉందని అన్నారు. టీడీపీ బూటకపు హామీలను నమ్మొద్దని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ మాదిరెడ్డి జయరామిరెడ్డి సచివాలయం కన్వీనర్ రాంభూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ధర్మవరం టౌన్ : పట్టణంలోని 14,18,19, 20 వార్డుల్లో గురువారం సాయంత్రం వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నాలుగు వార్డుల్లో ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే కేతిరెడ్డికి అపూర్వ స్వాగతం లభించింది. ఈ కార్యక్రమంలో 14వ వార్డు కౌన్సిలర్ గజ్జల శివ, 18వవార్డు ఇన్ఛార్జి కాళంగి శ్రీనివాసులు, 19వవార్డు కేశగాళ్ళ రామలక్ష్మి, ఇన్ఛార్జి కృష్ణమూర్తి, 20వవార్డు కౌన్సిలర్ లింగం నిర్మల, వార్డు ఇన్ఛార్జి ఉడుముల రాము, చేనేత నాయకులు గడ్డం శ్రీనివాసులు, బీరే ఎర్రిస్వామి, గుర్రం రాజా, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.