ప్రచారం చేస్తున్న గొండు శంకర్
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్
నగరంలో 16వ డివిజన్ పరిధిలోని గొంటివీధిలో డివిజన్ ఇన్ఛార్జి ఎస్వి రమణ మాదిగ, టిడిపి నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేష్ ఆధ్వర్యాన బుధవారం ప్రజాగళం ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ పాల్గొని ఇంటింటికి వెళ్లి సూపర్ సిక్స్ పధకాలను స్థానికులకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదేళ్ల వైసిపి పాలనలో ప్రజలు నిర్లక్ష్యానికి గురయ్యాయన్నారు. టిడిపి హయాంలో మొదలు పెట్టిన అనేక అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేసారు. ప్రధానమైన ఆమదాలవలస రోడ్డుతో పాటు నగరంలో చాలా రోడ్లు ఆధ్వన్న స్థితిలో ఉన్నాయని, చాలా ప్రాంతాల్లో కనీస మౌలిక సదుపాయాలు కూడ కరువయ్యాయని చెప్పారు. జగన్ పాలనలో రాష్ట్రం వెనుకబాటుకు గురైందని, రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు బాబు మళ్లీ సిఎం కావాలన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం యువ నాయకులుగా రామ్మోహన్ నాయుడు, తాను కృషి చేస్తామని, నగరాన్ని సుందర శ్రీకాకుళంగా తీర్చి దిద్దుతామని హామీనిచ్చారు. రానున్న ఎన్నికల్లో ఎంపీగా రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో డివిజన్ నాయకులు సవళాపురపు లక్ష్మి, కొండలరావు, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.