ఫిర్యాదు చేస్తున్న కీర్తికుమార్
టెక్కలి రూరల్ :
స్థానిక డిగ్రీ కళాశాల దగ్గర ఎన్నికలు పోస్టల్ బ్యాలెట్ జరుగుతున్న సమయంలో ఓ పత్రిక విలేకరి కీర్తికుమార్పై కానిస్టేబుల్ శనివారం దాడి చేశారు. అయితే పోలింగ్ అవుతున్న కొద్ది దూరంలో విలేకరులు కూర్చున్నా… వారి దగ్గరకు వచ్చి మీరు ఇక్కడ ఉండకూడదని, వెళ్లిపోవాలని కానిస్టేబుల్ చెప్పారు. దీంతో విలేకరి వెళ్తున్న సమయంలో కానిస్టేబుల్ మెడపై చెయ్యి వేసి ముందుకు నెట్టారు. దీంతో విలేకరి ఆర్ఒకి, డిఎస్పికి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో గనియా శ్రీనివాసరావు, కూన సుదర్శనరావు, రఘురాం, ఈశ్వరరావు, బగాది వాసు ఉన్నారు.