దాహార్తిని తీర్చే బాధ్యత అందరిదీ…

మండు వేసవిలో దాహార్తిని తీర్చే బాధ్యత మానవతావాదులు

మజ్జిగ పంపిణీ చేస్తున్న సురేఖ

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

మండు వేసవిలో దాహార్తిని తీర్చే బాధ్యత మానవతావాదులు అందరిపై ఉందని శ్రీకాకుళం ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పి.సురేఖ అన్నారు. శనివారం నగరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో స్టార్‌ వాకర్స్‌ క్లబ్‌ ఆధ్వర్యాన ఉచిత మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాల్లో స్టార్‌ వాకర్స్‌ చురుకైన పాత్ర పోషిస్తున్నారన్నారు. వేసవిలో నగరానికి అనేక అవసరాల రీత్యా వచ్చి వెళ్లే వారు ఎండ తీవ్రత వల్ల వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందని, అటువంటి వారికి దాహార్తి తీర్చాల్సిన బాధ్యత నగరవాసులపై ఉందన్నారు. కార్యక్రమంలో వాకర్స్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

 

➡️