ప్రజాశక్తి- బొబ్బిలి : రాష్ట్రంలో వైసిపి ప్రజా పాలనకు మద్దతి వ్వాలని ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు కోరారు. పట్టణంలోని 29వ వార్డులో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకూ న్యాయం జరిగిందన్నారు. రానున్న ఎన్నికల్లో వైసిపిని గెలిపించాలని కోరారు. ప్రచారంలో వైసిపి నాయకులు శంబంగి శ్రీకాంత్, మున్సిపల్ చైర్మన్ సావు వెంకట మురళీకృష్ణ, కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.ఎన్నికల హామీలను అమలు చేసిన ఘనత వైసిపితేఎన్నికల హామీలను 99శాతం అమలు చేసిన ఘనత వైసిపి ప్రభుత్వానికే దక్కుతుందని ఎమ్మెల్యే శంబంగిచ, ఎమ్పి బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. కోరాడవీధిలో ఆదివారం వారు విలేకరులతో మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో ఎన్నికల మ్యానిఫెస్టోను 99శాతం సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేశారన్నారు. మే 1న బొబ్బిలిలో జరగనున్న సిఎం జగన్ ఎన్నికల బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు. బలిజిపేట రోడ్డులో వాటర్ ట్యాంక్ వద్ద ఉదయం 10గంటలకు బహిరంగ సభ ప్రారంభం అవుతుందన్నారు.వైసిపిలోకి 50కుటుంబాలు చేరికమండలంలోని చింతాడ గ్రామానికి చెందిన 50 టిడిపి కుటుంబాలు ఆదివారం వైసిపి తీర్థం పుచ్చుకున్నాయి. మాజీ ఉపసర్పంచ్ కర్రి సత్యనారాయణ, మాజీ వార్డు మెంబర్ కర్రి జగన్నాధం, కో-ఆపరేటివ్ మాజీ అద్యక్షులు కర్రి సీతంనాయుడు, ఎం.బలరాం, ఎల్.లక్ష్మణ, ఎం.పోలినాయుడు, మరో 44కుటుంబాలు టిడిపిని వీడి ఎమ్మెల్యే శంబంగి, నియోజకవర్గ పరిశీలకులు మావుడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వైసిపిలో చేరాయి. కార్యక్రమంలో వైసిపి నాయకులు శంబంగి వేణుగోపాల్, కార్యకర్తలు పాల్గొన్నారు.సంక్షేమం చూసి మరోసారి అవకాశమివ్వండి డెంకాడ : సంక్షేమం, అభివృద్ధి చూసి ప్రజలు మరోసారి పట్టం కట్టాలని ఎంపిపి బంటుపల్లి వెంకటవాసుదేవరావు, ఎమ్మెల్యే తనయుడు బడ్డుకొండ మణిదీప్నాయుడు కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలోని ఆదివారం అమకాం, రఘుమండ పంచాయతీలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, ఎమ్పి బెల్లాన చంద్రశేఖర్కు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మరోసారి గెలిపించాలని కోరారు. పెద్దతాడివాడలో ఎంపిటిసి గాదిపిల్లి రమేష్, కరుమజ్జి త్రినాధరావు, సురేష్, గురునాయుడు ఆధ్వర్యంలో ఆ గ్రామంలో ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపిపి పిన్నింటి తమ్మునాయుడు, సర్పంచులు దిండి అప్పారావు, గూడేల విష్ణు తదితరులు పాల్గొన్నారు. వైసిపిలో చేరిన మేజర్ పంచాయతీ సర్పంచ్శృంగవరపుకోట: మండలంలోని ధర్మవరం మేజర్ పంచాయతీ సర్పంచ్ గాలి సన్యాసయ్య, వార్డు సభ్యులు దార కాంతం, అలమండ ప్రసాద్, రొబ్బి కోట లక్ష్మి, దాసరి వెంకట కళ్యాణితో పాటు 300 కుటుంబాలు ఎమ్మెల్యే అభ్యర్ధి కడుబండి శ్రీనివాసరావు, నియోజకవర్గం పరిశీలకులు తైనాల విజరు కుమార్ ఆద్వర్యంలో వైసిపిలో చేరారు. పార్టీలో చేరినవారికి ఎమ్మెల్యే అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావు పార్టీ కండువాలువేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫోక్ అండ్ కల్చరల్ డైరెక్టర్ వాకాడ రాంబాబు, జెడ్పిటిసి ఎం.వెంకటలక్ష్మి, వైసిపి మండల అద్యక్షుడు మోపాడ కుమార్, వైస్ ఎంపిపి పినిశెట్టి వెంకటరమణ, పట్టణ అధ్యక్షుడు రెహమాన్, పాలకుర్తి హరినాథ్, కోసూరు భారతి, డాక్టర్ వరలక్ష్మి, అల్లు మహాలక్ష్మి నాయుడు (బుజ్జి), దూల కనకమహాలక్ష్మి, లగుడు అవతారం, సర్పంచ్లు, ఎంపిటిసిలు తదితరులు పాల్గొన్నారు.