ప్రజాశక్తి -తగరపువలస : ఆంధ్రా యూనివర్సిటీ ఈ నెల 7వ తేదీన విడుదల చేసిన తొలి ఏడాది తొలి సెమిస్టర్ ఫలితాల్లో తమ కళాశాల విద్యార్థులు ప్రతిభ చూపినట్లు కళాశాల చైర్మన్ బి నరసింగరావు, ప్రిన్సిపల్ జి సతీష్ కుమార్ తెలిపారు. బిఎస్సి కెమిస్ట్రీలో వి.పైడిరాజుకు 10 పా యింట్లకు 8.60 పాయింట్లతో మండలానికి ప్రథమ స్థానంలో నిలిచినట్లు పేర్కొన్నారు. కె.సింధు 10 పాయింట్లకు 8.45 పాయింట్లు సాధించినట్లు వివరించారు. 8 పాయింట్లకు పైగా 30 మంది, 7పాయింట్లకు పైగా 60 మంది సాధించారని తెలిపారు. 99 శాతం ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కళాశాలలో చైర్మన్ నరసింగరావు, ప్రిన్సిపల్ సతీష్ కుమార్, అధ్యాపకులు అభినందించారు.