రాష్ట్ర ప్రజల సంపూర్ణ ఆరోగ్యమే జగనన్న ఆరోగ్య సురక్ష లక్ష్యం : ఎంపీడీఓ రాముడు

Feb 6,2024 13:35 #goal, #health, #mpdo, #people, #State

ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : పేద ప్రజలు వైద్యం కోసం ఇబ్బందులుపడకుండా, ఇంటి వద్దకే వైద్యాన్ని అందించడమే ఆరోగ్య సురక్ష లక్ష్యం అని ఎంపీడీవో రాముడు అన్నారు. మండల పరిధిలోని చములూరు గ్రామంలో మంగళవారం జరిగిన మళ్లీ విడత ”జగనన్న ఆరోగ్య సురక్ష” మెగా వైద్య శిబిరంలో పాల్గన్న ఎంపీడీఓ.. వైద్యులతో మాట్లాడుతూ … వైద్యం కోసం వచ్చిన ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి, వారికి అవసరమైన మందులు అందజేయాలని వైద్యులకు వైద్య సిబ్బందికి సూచించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం పేద ప్రజలకు వరంలాంటిది అన్నారు. కార్పొరేటు వైద్యానికి దీటుగా జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా పేదలకు మెరుగైన వైద్యం అందించడం ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ మలేశ్వరయ్య, సర్పంచ్‌ మల్లీశ్వరి, ఈఓఆర్డీ శైలజరాణి, పప్పు వైద్యశాల డాక్టర్లు మహేంద్ర, హాజీర ఎంపీహెచ్‌ఈఓ మల్లికార్జున, ఎం పి హెచ్‌ ఎస్‌ శ్రీరాములు, పంచాయతీ కార్యదర్శి వరలక్ష్మి, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది, గ్రామ పెద్దలు, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.

➡️