ప్రజాశక్తి -కనిగిరి : వైసిపితోనే పేదల సంక్షేమం సాధ్యమని వైసిపి కనిగిరి నియోజక వర్గ అభ్యర్థి డాక్టర్ దద్దాల నారాయణ తెలిపారు. కనిగిరి మండలం తాళ్లూరు పంచాయతీ పరిధిలోని పాలూరి వారిపల్లిలో సోమవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా దద్దాల నారాయణ మాట్లాడుతూ సంక్షేమ ప్రజా పరిపాలన సాగాలంటే జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి కావాలన్నారు. ఎమ్మెల్యేగా తననను, వైసిపి ఒంగోలు ఎంపీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ చింతలచెరువు సత్యనారాయణ రెడ్డి, పిడిసిసి బ్యాంకు చైర్మన్ ప్రసాద్ రెడ్డి ,కనిగిరి జడ్పిటిసి మడతల కస్తూరి రెడ్డి, వైసిపి నాయకులు మూలె మాలకొండారెడ్డి , రహీం, బుజ్జి ,పాలూరి నాగిరెడ్డి, పాలూరి సుబ్బారెడ్డి ,గాలి తిరపతయ్య,సిద్ధారెడ్డి, పిల్లి లక్ష్మీ నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.వినూత్న రీతిలో దద్దాల ప్రచారం గుడ్ మార్నింగ్ కనిగిరి అంటూ వైసిపి కనిగిరి నియోజక వర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దద్దాల నారాయణ యాదవ్ సోమవారం వినూత్న రీతిలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం ఏడు గంటలకు టీ దుకాణాల వద్ద ఉన్న ప్రజలతో కలిసి టీ తాగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో వైసిపిని గెలిపించాలని కోరారు. పేదల సంక్షేమం వైసిపితోనే సాధ్యమని తెలిపారు. కనిగిరి ఎమ్మెల్యేగా తనను, వైసిపి ఒంగోలు ఎంపీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఒంగోలు బస్టాండ్ వద్ద నుంచి బొడ్డు చావిడి, ఎంఎస్ఆర్ రోడ్డులో ప్రచారాన్ని కొనసాగించారు. ఈ కార్యక్రమంలో రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ చింతలచెరువు సత్యనారాయణ రెడ్డి, పిడిసిసి బ్యాంక్ చైర్మన్ ప్రసాద్ రెడ్డి ,మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ ,ఎఎంసి చైర్మన్ సాల్మన్ రాజ్, వాసవి సత్ర సముదాయాల అధ్యక్షుడు దేవకి వెంకటేశ్వర్లు, సాయిబాబా దేవస్థానం అధ్యక్షుడు దేవకి సుబ్రహ్మణ్యం, వార్డు కౌన్సిలర్లు దేవకి రాజీవ్, నక్క రామకష్ణ , వైసిపి పట్టణ ఎస్సిసెల్ నాయకుడు కిషోర్ , వైసిపి నాయకులు వీరం రెడ్డి బ్రహ్మారెడ్డి, జిలాని తదితరులు పాల్గొన్నారు.దద్దాలకు మద్దతుగా ప్రచారం..వెలిగండ్ల : ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన మేనిఫెస్టో ప్రజారంజక మైనదని వెలిగండ్ల జడ్పిటిసి గుంటక తిరుపతిరెడ్డి అన్నారు.పేద బడుగు బలహీన వర్గాలకు పెద్దపీటవేసే మేనిఫెస్టో అని తెలిపారు. వైసిపి కనిగిరి నియోజక వర్గ అభ్యర్థి డాక్టర్ దద్దాల నారాయణను గెలిపించాలని కోరుతూ మండల పరిధిలోని పందువ నాగులవరం పంచాయతీలో సోమవారం ప్రచారం నిర్వహించారు.ఈ సందర్బంగా తిరుపతి మాట్లాడుతూ నవరత్నాల పేరుతో పేద ప్రజలందరికీ నేరుగా లబ్ధి చేకూరినట్లు తెలిపారు. దద్దాల నారాయణ యాదవ్ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి తిరుపతిరెడ్డి, కటికల వెంకటరత్నం, వైసిపి మండల అధ్యక్షుడు గజ్జల వెంకటరెడ్డి, ఎంపిటిసి పాప బత్తిని నాగేశ్వరరావు, సేవాదళ్ అధ్యక్షుడు చెన్న కష్ణయ్య, వెలిగండ్ల సర్పంచి తాతపూడి సురేష్, సింగిల్ విండో మాజీ చైర్మన్ పొల్ల సుబ్రహ్మణ్యం, వైసిపి యూత్ మండల అధ్యక్షుడు దమ్ము కేశవులు, వైసిపి నాయకులు నాగూర్ యాదవ్, ఎలికా రమణయ్య, తెలుగు రమణయ్య, శివరాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.