జగనన్న విద్యాదీవెన లబ్ది రూ.29.50 కోట్లుప్రజాశక్తి – తిరుపతి టౌన్ జగనన్న విద్యాదీవెన పథకం కింద జిల్లాలో 39,368 మంది విద్యార్థులకు రూ.29.50 కోట్ల లబ్ది చేకూరింది. శుక్రవారం ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కృష్ణాజిల్లా నుంచి విద్యార్థులకు బటన్ నొక్కి నగదును వారి ఖాతాలో నేరుగా జమచేసి ప్రారంభించారు. తిరుపతి కలెక్టరేట్లో కలెక్టర్ లక్ష్మీ శ హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ విద్యాదీవెన మొత్తం తల్లుల, విద్యార్థుల ఉమ్మడి ఖాతాలో జమ అయిన పది రోజుల్లోపు సంబంధిత కళాశాలలకు చెల్లించి తల్లులు సహకరించాలని, లేనిచో తదుపరి వారి జగనన్న విద్యాదీవెన మొత్తాన్ని నేరుగా కళాశాలలకు చెల్లిస్తామన్నారు. మెగాచెక్ను విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ సాధికార అధికారి చెన్నయ్య, జిల్లా బిసి సంక్షేమ శాఖ అధికారి భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.
![జగనన్న విద్యాదీవెన లబ్ది రూ.29.50 కోట్](https://prajasakti.com/wp-content/uploads/2024/03/jaganna.jpg)