వెంకటరావుకు పలువురి నివాళి

ప్రజాశక్తి-సంతనూతలపాడు: మండలంలోని ఎనికపాడు గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు నల్లూరి వెంకటరావు అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న టీడీపీ నియోజకవర్గ అభ్యర్థి బీఎన్‌ విజరు కుమార్‌ గురువారం ఆయన మృతదేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపి అధ్యక్షుడు మద్దినేని హరిబాబు, చీమకుర్తి మండల నాయకులు జీ రాఘవరావు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

➡️