ప్రజాశక్తి-విజయనగరం కోట : తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతిరాజు, నియోజకవర్గ ఇంచార్జ్, తెలుగుదేశం పార్టీ జనసేన విజయనగరం శాసనసభ ఉమ్మడి అభ్యర్థి పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు సూచన మేరకు “జయహో ఎస్సీ” కార్యక్రమం ద్వారా నియోజకవర్గ ఎస్సి సెల్ నాయకులు ఈరోజు 27వ డివిజన్ జొన్నగుడ్డి – స్టేడియం పేట ప్రాంతంలో దళిత కుటుంబాల ఇంటింటికి వెళ్లి వైసిపి ప్రభుత్వం దళితులకు చేసిన అన్యాయాలను వివరిస్తూ, గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో దళితులకు అందించిన పధకాలను వివరిస్తూ, దళితులకు రక్షణ, ఆర్ధిక, సామాజికాభివృద్ది కల్పించాలంటే తెలుగుదేశం పార్టీ – జనసేన పార్టీలకు మద్దతుగా దళితులందరు నిలిచి సైకిల్ గుర్తుపై ఓటు వేసి విజయనగరం శాసనసభ అభ్యర్థి పూసపాటి అదితి విజయలక్ష్మి, గజపతిరాజుని గెలిపించాలని కోరారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/03/Jayaho-SC-Door-to-door-campaign.jpg)