పసలపూడి నిడదవోలు ఎమ్మెల్యే పర్యాటన

Feb 24,2024 16:10 #East Godavari, #MLA

ప్రజాశక్తి-ఉండ్రాజవరం (తూర్పుగోదావరి) : మండలంలోని పసలపూడిలో నూతనంగా నిర్మించి, శనివారం ప్రారంభించిన కోట సత్తెమ్మ ఆలయాన్ని నిడదవోలు ఎమ్మెల్యే జి.శ్రీనివాస్‌ నాయుడు, నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు తదితర ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ నాయుడు మాట్లాడుతూ.. కోట సత్తెమ్మ దీవెనలు రాష్ట్ర ప్రజలపై ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. అనంతరం అన్న ప్రసాదం భక్తులకు స్వయంగా వడ్డించారు. 30 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఆలయానికి నిడదవోలు ఎమ్మెల్యే రెండు లక్షల రూపాయలు విరాళం అందజేసినట్లు గ్రామ సర్పంచ్‌ కట్టా లక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా దేవాలయ నిర్మాణానికి సహకరించిన పంచాయతీ సభ్యులకు, గ్రామస్తులకు విరాళాలందించి, సహకరించిన ప్రతి ఒక్కరికి సర్పంచ్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి నందిగం భాస్కర రామయ్య, ఎంపీటీసీ కట్టా వెంకట లక్ష్మి, మండల కో ఆప్షన్‌ సభ్యులు షేక్‌ షాజహాన్‌, మాజీ ఎంపీపీ వల్లేపల్లి రాజా, మద్దుకూరి శ్రీమన్నారాయణ, పార్థసారథి, గ్రామస్తులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

➡️