కాంగ్రెస్ తాడేపల్లిగూడెం ఎంఎల్ఎ అభ్యర్థి మార్నీడి బాబ్జి
ప్రజాశక్తి – తాడేపల్లిగూడెం
తనకు ఒక్కసారి అవకాశం కల్పించాలని, సామాన్యుడుకి అవకాశం ఇస్తే తాడేపల్లిగూడెం పట్టణాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని, ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని కాంగ్రెస్ తాడేపల్లిగూడెం ఎంఎల్ఎ అభ్యర్థి మార్నీడి బాబ్జి అన్నారు. మంగళవారం 6, 7, 8 వార్డుల్లో, సీతారాంపేట, కొబ్బరి తోటలో గడపగడపకూ తిరిగి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ పెద్దలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.