ప్రజాశక్తి – పెనుమంట్ర
నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన సి.నాగరాణిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపినట్టు రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘ అధ్యక్షులు బి.రవీంద్ర రాజు శనివారం తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం నాయకులు, జిల్లాలోని విఆర్ఒలు అందరూ పూర్తిగా సహకరిస్తారని తెలిపామన్నారు. విఆర్ఒల సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించి, విఆర్ఒల సమస్యలు పరిష్కారానికి కృషిచేస్తానని కలెక్టర్ అన్నట్లు తెలిపారు. కలెక్టర్ను కలసిన వారిలో జిల్లా, రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఉపాధ్యక్షులు మిరియాల లక్ష్మీనారాయణ, జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ గుమ్మల్ల జకరయ్య, నరసాపురం డివిజన్ అధ్యక్షులు కెవివి సత్యనారాయణ, భీమవరం డివిజన్ జాయింట్ సెక్రటరీ వి.ముత్యాల రావు, మండల అధ్యక్షులు ఆర్.రత్న రాజు, అత్తిలి మండల అధ్యక్షులు బి.బాబులు, చొప్పల భూషణం ఉన్నారు.