ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించండి

ప్రజాశక్తి-గణపవరం (పశ్చిమగోదావరి) : మత విద్వేషాలను రెచ్చగొట్టి దేశ ఐక్యతకు భంగం కలిగిస్తున్న బిజెపి దాన్ని బలపరుస్తున్న పార్టీలను ఓడించి ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలని కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి పాతపాటి హరికుమార్‌ రాజు కోరారు. శనివారం ఉంగుటూరు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి పాతపాటి హరికుమార్‌ రాజు ఎస్‌ కొండేపాడులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా హరి కుమార్‌ రాజు సిపిఎం కార్యకర్తలతో కలిసి ప్రతి ఇంటి వద్దకు వెళ్లి ఓట్లను అభ్యర్ధించారు. ప్రలోభాలకు లోను కాకుండా ఆలోచించి దేశ ఐక్యతను సమగ్రతను కాపాడే ఇండియా వేదిక అభ్యర్థులు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల గుర్తు అయిన హస్తం గుర్తుకి ఓటేసి గెలిపించాలని కోరారు. ప్రస్తుతం సమయంలో బిజెపిని దాన్ని బలపరుస్తున్న పార్టీలను ఓడించవలసిన అవసరాన్ని.. సిపిఎం కార్యకర్తలు ప్రజలకు వివరిస్తూ హస్తం గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షులు జిచంద్రశేఖర రావు, సిపిఎం కార్యకర్తలు పి.నరసింహమూర్తి, ఎం.పెంటారావు, జి.శ్రీను, కాంగ్రెస్‌ కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️