ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : విజయనగరం వైసిపి ఎమ్మెల్యే అభ్యర్ధి కోలగట్ల వీరభద్రస్వామి విజయాన్ని కాంక్షిస్తూ నగరంలో వైసిపి మహిళా విభాగం ఆధ్వర్యాన భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. ఉత్సాహంగా సాగిన ఈ ర్యాలీలో మహిళలు కోలగట్లకు మద్దతుగా నినాదాలు చేశారు. కోలగట్ల నివాసం నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీ ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్, కోట, దాసన్నపేట, ఖాదర్ నగర్, ప్రేమ సమాజం, మూడు లాంతర్లు, కన్యకా పరమేశ్వర ఆలయం, సిఎంఆర్ జంక్షన్, రైల్వేస్టేషన్, ఆర్టిసి కాంప్లెక్స్, అంబేద్కర్ జంక్షన్ మీదుగా మళ్లీ కోలగట్ల నివాసానికి చేరింది. ర్యాలీని ప్రారంభించిన డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి కోలగట్ల వీరభద్ర స్వామి తోనే సాధ్యమని అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతత్వంలో సంక్షేమ, అభివృద్ధి పాలన సాగుతుందన్నారు. ఎన్నికలలో పార్లమెంట్ సభ్యునిగా బెల్లాన చంద్రశేఖర్కు, ఎమ్మెల్యేగా కోలగట్ల వీరభద్ర స్వామికి ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ముచ్చులయా యాదవ్, ఎఎంసి చైర్పర్సన్ శశి భార్గవి, మున్సిపల్ మాజీ వైస్ చైర్పర్సన్ లెంక వరలక్ష్మి, బిసి నాయకులు గదుల సత్యలత, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, మహిళ నాయకులు, కార్యకర్తలు, కోలగట్ల అభిమానులు పాల్గొన్నారు.