సమస్యల పరిష్కారానికి కృషి

జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేష్‌ బాబు.

ప్రజాశక్తి- సబ్బవరం: మండలంలోనిచినగొల్లలపాలెం, ఇరువాడ, పైడివాడ, పైడివాడ అగ్రహారం, గొల్లలపాలెం గ్రామాలలో బుధవారం జనసేన, బిజెపి, టిడిపి కూటమి బలపరిచిన జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేష్‌బాబు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పైడివాడ అగ్రహారంలో పంచకర్ల దృష్టికి పలు సమస్యలను స్థానిక ఎంపిటిసి సీరం అప్పలరాజు తీసుకెళ్లగా, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్కటొక్కటిగా అన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 13న జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనను గాజు గ్లాసు గుర్తుపైనా, అనకాపల్లి ఎంపిగా బిజెపి అభ్యర్థి సిఎం రమేష్‌ను కమలం గుర్తుపై ఓటేసి గెలిపించాలని అభ్యర్థించారు.కార్యక్రమంలో గండి వంశీ, బలిరెడ్డి అప్పారావు, ఇందల వెంకటరమణ, అక్కిరెడ్డి రామలక్ష్మి, దుర్గి నాయుడు, సరిపల్లి విష్ణు, బిజెపి నాయకులు వనం సత్యనారాయణ గోంప నర్సింగరావు, కోరాడ శ్రీనివాసరావు పల్లా తాతారావు, బలిరెడ్డి సూర్య ప్రసాద్‌, అప్పారావు పాల్గొన్నారు.

తానాంను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తా

పరవాడ: మండలంలోని తానాం గ్రామంలో మంగళవారం రాత్రి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేష్‌బాబు ప్రచారం చేశారు. గ్రామంలోని మహిళలు, యువకులు, కార్యకర్తలు, పైలా యువసేన, కన్నూరు యువసేన కార్యకర్తలు ఘన స్వాగతం పలికి, పంచకర్లపై అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భ తానాం గ్రామాన్ని దత్తత తీసుకుంటానని, ఫార్మా కాలుష్యంతోపాటు నిర్వాసితుల సమస్యలను పరిష్కరిస్తానని భరోసానిచ్చారు. గ్రామ సర్పంచ్‌ కన్నూరు దేవి, మాజీ జడ్పిటిసి పైలా జగన్నాథరావు, అనకాపల్లి మార్కెట్‌ కమిటీ మాజీ వైస్‌ చైర్మన్‌ కన్నూరు వెంకటరమణ, మాజీ ఎంపీపీ మాసవరపు అప్పలనాయుడు, మాజీ జెడ్‌పిటిసి మాదంశెట్టి నీలబాబు, టిడిపి మండల పార్టీ అధ్యక్షులు వియ్యపు చిన్నా, రావాడ సర్పంచ్‌ మోటూరు సన్యాసినాయుడు పాల్గొన్నారు.

జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేష్‌ బాబు.

➡️