తాగునీటి సమస్యను పరిష్కరించడంలో వైసిపి విఫలం : దేవుడు నాయుడు

May 4,2024 17:35 #hukumpeta

ప్రజాశక్తి -హుకుంపేట: తాగునీటి సమస్యను పరిష్కరించడంలో వైసిపి విఫలమైందని సిపిఎం జిల్లా నాయకులు దేవుడు నాయుడు ఆరోపించారు. అల్లూరి జిల్లాలోని పాతకొట పంచాయతీ లోని పి.చింతలవిదీ గ్రామంలో తాగునీటి సమస్యపై ఆయన మాట్లాడారు. మండలంలో తాగునీటి సౌకర్యం కల్పించాలని గిరిజన మహిళాలు ఆవేదన వ్యక్తంచేశారు. మండలంలోని పాతకొట పంచాయతీ లోని పి.చింతలవిదీ,.పాతకొట గ్రామంలో తాగునీటి కొరత వేసవి కాలం కావడంతో నీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఓట్లు అడిగే నాయకులు గ్రామంలో నెల కొన్న తాగునీటి సౌకర్యం కల్పించాలని కోరారు. తాగునీటి సౌకర్యం కల్పించని నాయకులకు ఓటు హక్కును అడిగే హక్కు లేదని అన్నారు.5సంవత్సరం పరిపాలన చేసి తాగునీటి సౌకర్యాలు కూడా ఇవ్వలేని దుస్థితి వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఉందని అన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ప్రజాసమస్యలపై గాలికి వదిలేసి హమీలు నేరవేర్చాం అని చెప్పి గిజనులకు మోసం చేసిందన్నారు.ఈకార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు దేవుడు నాయుడు, నాయకులు, శివ,చిట్టిబాబురామా రావు, గ్రామ ప్రజలు బాకురు శ్రీనివాస రాజు,బాకురు,చిన్నలమ్మ సోసిత,లక్ష్మీ,తదితరులు పాల్గొన్నారు.

➡️