హీరో రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ చేంజర్’. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్పై నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత రామ్ చరణ్ చేస్తున్న సినిమా కావటంతో గేమ్ ఛేంజర్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే రామ్చరణ్ జన్మదినం సందర్భంగా విడుదల చేసిన ‘జరగండి’ అనే పాటను విడుదల చేసిన విషయం తెలిసిందే. మే మొదటి వారంలో చెన్నైలో కీలక షెడ్యూల్ ప్రారంభంకానుంది. ఈ షెడ్యూల్లో నవీన్ నచంద్ర, సునీల్, కియారా అద్వానిలపై ప్రీ క్లైమాక్స్ ఘట్టాలు తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. రాజకీయాల నేపధ్యంలో వస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తుండగా అంజలి, కియారా జంటగా నటిస్తున్నారు. మే1 నుంచి తుది షెడ్యూల్ చైన్నె ప్రాంతంలో ప్రారంభమవుతుండగా యాక్షన్, కొన్ని కామెడీ సీన్స్ తెరకెక్కించనున్నట్లు సమాచారం. జూలైలో పూర్తి చేసి దసరా లేదా దీపావళికి గాని విడుదల చేయాలని చిత్ర నిర్మాతలు ఏర్పాట్లు చేస్తున్నారు.