విశ్వక్సేన్ ప్రధానపాత్రలో వస్తున్న తాజా చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. ఈ చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. నేహాశెట్టి హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాను తెలంగాణ లోక్సభ ఎన్నికల అనంతరం మే 17న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా టీజర్ను ఏప్రిల్ 27 సాయంత్రం విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాలో అంజలి కీలక పాత్రలో నటిస్తున్నారు.