ప్రభాస్ నటిస్తున్న ‘కల్కి 2989 ఏడీ’ చిత్రం గురించి దర్శకుడు నాగ్ అశ్విన్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాజాగా నాగ్ అశ్విన్ సినాప్స్ అనే ఓ టెక్నాలజీ, మైథాలజీ ఇంటరాక్షన్ మీట్లో పాల్గొన్నారు. అక్కడ ‘కల్కి’ గురించి ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ‘మహాభారతం’, స్టార్ వార్స్… రెండింటినీ చూస్తూ, వింటూ పెరిగాను. ఈ రెండు ప్రపంచాలను కలిపే ఒక గొప్ప సినిమా చేయాలనుకున్నప్పుడు ‘కల్కి 2898 ఏడీ’ పుట్టింది. ఈ సినిమా కూడా మహాభారతం కాలం నుంచి మొదలై 2898లో పూర్తవుతుంది. అందుకే సినిమాకు ఆ టైటిల్ పెట్టాం. సినిమా 6000 సంవత్సరాల మధ్య జరిగే కథని చూపిస్తుంది. సినిమాలో ప్రధానమైన పాత్రలన్నీ ఇండియన్ మైథాలజీ చుట్టే ఉంటాయి. భవిష్యత్తు ప్రపంచం ఎలా ఉంటుందో చూపే ప్రయత్నం కూడా చేశాం. ఈ క్రమంలోనే ఓ ఊహా ప్రపంచాన్ని క్రియేట్ చేశాం.’ అని తెలిపారు. ఈ ఏడాది మే 9న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రంలో ప్రభాస్, దీపిక పదుకొణె జంటగా నటించారు. కమల్హాసన్, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్పై సి.అశ్వినీదత్ నిర్మిస్తున్నారు.