హీరో ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ‘కల్కి 2898 ఏడీ’. సలార్ తర్వాత ప్రభాస్ నుంచి రాబోతున్న సినిమా ఇదే. ఇప్పటికే అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశాపఠాని లాంటి స్టార్స్ను ఇందులో కీలకపాత్రలు పోషిస్తున్నారు. ప్రభాస్ ఇంట్రో, ఎలివేషన్కు మహేష్బాబు వాయిస్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. గతంలోనూ మహేశ్ పలువురు స్టార్ హీరోల సినిమాలకు వాయిస్ ఓవర్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ ‘జల్సా’, ఎన్టీఆర్ ‘బాద్షా’, చిరంజీవి ‘ఆచార్య’ సినిమాలకు మహేశ్ తన స్వరంతో కథారంభాన్ని వినిపించిన విషయం తెలిసిందే!